Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వాంఖడే స్టేడియంలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మొదటి వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా 35.4 ఓవర్లలోనే ఆసీస్ ను 188 పరుగులకు ఆల్ ఔట్ చేసింది. భారత పేస్ బౌలర్లు ఈ మ్యాచులో సత్తా చాటారు. జడేజా రాణించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను ఔట్ చేసి మొదటి బ్రేక్ అందించాడు. తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్, మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ తో కలిసి ఇన్నింగ్స్ ని చక్క బెట్టాడు.