Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నిజామాబాద్
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కు బిగ్ షాక్ తగిలింది. బీజేపీ ఎంపీ అరవింద్ కు తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్సీ ఎస్టీలను కించపరిచేలా వాఖ్యలు చేశారని మాదన్నపేటలో 2022లో నమోదైన ఎస్సీ ఎస్టీ కేస్ ట్రైయిల్ ఫేస్ చేయాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసు పై విధించిన స్టే వేకెట్ చేసింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. ఎఫ్ఐఆర్ నమోదుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అరవింద్ పోలీసులు తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.