Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: రాజేంద్రనగర్ శాస్త్రీపూరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదామ్ లో పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదామ్లో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధం అయ్యాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. గాటైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తోన్న అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.