Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: గగనతల విహారంతో సంబంధం లేని (నాన్ ఫ్లైయింగ్) ఉద్యోగుల కోసం మరో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకాన్ని ఎయిరిండియా ప్రకటించింది. గతేడాది జనవరిలో టాటా గ్రూపు చేతికి ఎయిరిండియా చేరాక, వీఆర్ఎస్ను ప్రకటించడం ఇది రెండో సారి. 40 ఏళ్లు, అంతకుమించిన వయస్సుండి, ఎయిరిండియాలో కనీసం అయిదేళ్లుగా పనిచేస్తున్న శాశ్వత జనరల్ కేడర్ అధికారుల కోసం తాజా వీఆర్ఎస్ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. క్లరికల్, అన్స్కిల్డ్ విభాగాల్లో కనీసం అయిదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు కూడా ఈ పథకానికి అర్హులేనని పేర్కొంది. ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉండే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు సుమారు 2,100 మందికి అర్హత ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిరిండియాలో 11,000 మంది (ఫ్లైయింగ్, నాన్ ఫ్లైయింగ్) సిబ్బంది పనిచేస్తున్నారు.