Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాకిస్థాన్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తాజాగా ఉగ్రవాద కేసు నమోదైంది. ఇమ్రాన్ పై ఓ కేసు విచారణ సందర్భంగా ఇస్లామాబాద్ లోని కోర్టు సముదాయం వద్ద పీటీఐ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయని, పీటీఐ కార్యకర్తలు భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. ఓ కేసు విచారణ నిమిత్తం ఇమ్రాన్ ఖాన్ లాహోర్ నుంచి ఇస్లామాబాద్ చేరుకోగానే, పీటీఐ కార్యకర్తలు కోర్టు గేటును, పోలీస్ చెక్ పోస్టును ధ్వంసం చేశారని పోలీసులు ఆరోపించారు. ఈ సందర్భంగా 17 మంది పీటీఐ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో పీటీఐ కార్యకర్తలతో పాటు 25 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయని వివరించారు. ఇమ్రాన్ ఖాన్ పై ఇప్పటికే 9 కేసులు ఉండగా, ఆయా కేసుల్లో అరెస్ట్ చేయవద్దంటూ ఇస్లామాబాద్ న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.