Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: పేటీఎం పబ్లిక్ ఇష్యూ మదుపర్లకు భారీ నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో, కొత్తతరం కంపెనల పబ్లిక ఇష్యూ (ఐపీఓ)లకు అనుమతులివ్వడంలో సెబీ కఠిన వైఖరి అవలంబిస్తోంది. గత 2 నెలల్లో 6 కంపెనీల ఐపీఓ అభ్యర్థనలను తిరస్కరించింది. ఇందులో ఓరావెల్ స్టేస్ కూడా ఉంది. ఓయో బ్రాండ్పై హోటళ్లను నిర్వహిస్తున్న సంస్థ ఇది. ఈ కంపెనీలు మరిన్ని పత్రాలతో, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సెబీ కోరింది. ఓయోతో పాటు గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (కెనడాకు చెందిన ఫెయిర్ఫ్యాక్స్ గ్రూప్), లావా ఇంటర్నేషనల్, బీ2బీ చెల్లింపులు-సేవల సంస్థ పేమేట్ ఇండియా, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ కంపెనీ బీవీజీ ఇండియా ఐపీఓ దరఖాస్తులనూ సెబీ తిరస్కరించింది. ఈ 6 కంపెనీలు 2021 సెప్టెంబరు నుంచి 2022 మే మధ్య తమ ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి. వీటిని ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 10 మధ్య సెబీ తిరస్కరించింది. ఈ కంపెనీలన్నీ కలిసి సమీకరించాలనుకున్న మొత్తం రూ.12,500 కోట్లు. 2021లో 63 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1.2 లక్షల కోట్లు సమీకరించగా, 2022లో 38 సంస్థలు రూ.59,000 కోట్లే సమీకరించాయి. ఎల్ఐసీ రూ.20,557 కోట్ల ఇష్యూ లేకపోతే, గతేడాది ఈ మొత్తం మరింత తక్కువ ఉండేది.