Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాజమండ్రి: రాజమండ్రిలో ముందస్తుగా అరెస్టులు కొనసాగుతున్నాయి. ఐక్యవేదిక కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేసి..రాజానగరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ముందస్తుగానే అరెస్ట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిర్వహించే ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, ఆందోళనలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 1ను రద్దు చేయాలని ఈనెల 20న నిర్వహిస్తున్న ‘చలో అసెంబ్లీ’ని జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, టీడీపీ పాలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పిలుపునిచ్చారు. దీంతో పోరాట ఐక్య వేదిక నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు నేతలను హౌస్ అరెస్ట్ చేసి..నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.