Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పేపర్ లీకేజ్ కేసు పిటిషన్ ను రేపటికి వాయిదా వేయాలని బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కోరారు. ఈ తరుణంలో తదుపరి విచారణను రేపటి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సుప్రీం కోర్టు న్యాయవాది కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా వాదనలు వినిపిస్తారని కోర్టుకు న్యాయవాది కరుణాకర్ తెలిపారు. కాగా, ఇదే కేసులో హైకోర్టులో నిరుద్యోగులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కూడా రేపటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.