Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం కొత్త మిర్చికి సోమవారం రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కెట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం. సోమవారం ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్లో నిర్వహించిన జెండా పాటలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని జెండా పట్టి ధర నిర్ణయించారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. ఖమ్మం మార్కెట్లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది అని పేర్కొన్నారు. ఖమ్మం మార్కెట్ను అంతర్జాతీయ మార్కెట్కు చిరునామాగా తీర్చిదిద్దుతామని చిల్లీస్కు హబ్గా చేస్తామని తెలిపారు. కొన్ని క్వింటాలే కాదు.. రైతులు మార్కెట్కు తీసుకొచ్చిన ప్రతి బస్తాను కొనుగోలు చేస్తారన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం లాభసాటిగా మారిందని, మనం పండించే మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందన్నారు. ఖమ్మంలో చైనా దేశం మిర్చి కంపెనీలను ఏర్పాటు చేసి.. నాణ్యమైన మిర్చిని అక్కడకు ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. రైతుల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉందని, అందుకే రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నామని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.