Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: వైఎస్ వివేక కేసులో ఏ-4 దస్తగిరిని అప్రూవర్గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా తమను నేరంలోకి నెట్టడం సమంజసం కాదని పిటిషన్లో పేర్కొన్నారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారించింది. సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు. కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్ ఇవ్వటం సరికాదు. వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరినే. దస్తగిరి బెయిల్ సమయంలోనూ సీబీఐ సహకరించింది. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదు. అని భాస్కర్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.