Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించే ఈ పరీక్షకు సోమవారం (మార్చి 20) నుంచి ఏప్రిల్ 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. దరఖాస్తు రుసుం రూ.650లుగా చెల్లించాల్సి ఉంటుంది. అదే, బీసీ విద్యార్థులైతే రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.550లు చొప్పున చెల్లించాలి. మే 24, 25 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం అడ్మిట్ కార్డులను మే 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఈ పరీక్షను ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకుబీ అలాగే, మధ్యాహ్నం 3గంల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు రెండు షిఫ్టులలో నిర్వహించనున్నట్టు ఐసెట్ కన్వీనర్ తెలిపారు.