Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. తదుపరి విచారణకు వర్చువల్గా హాజరుకావాలనుకుంటే దరఖాస్తు దాఖలు చేయాలని కోరింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణల క్రమంలో సీబీఐ, ఈడీ ఆయనను విచారిస్తున్నాయి. దీంతో ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను కోర్టు ముందు హాజరుపరిచింది. దర్యాప్తు పెండింగ్లో ఉన్నందున సిసోడియాను కస్టడీని సీబీఐ కోరడంతో కస్టడీని పొడిగించింది. దర్యాప్తు దశలో ఉందని, జ్యుడీషియల్ కస్టడీ అవసరమని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని అవెన్యూ కోర్టు కస్టడీని ఏప్రిల్ 3 వరకు పొడిగించింది.