Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు రెండోసారి హాజరైన ఎమ్మెల్సీ కవితను అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులు దాదాపు 8 గంటలుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం కేసులో మనీలాండరింగ్ అంశంలో ఆమెపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు కవిత విచారణ కొనసాగుతుండగానే.. తెలంగాణ అదనపు ఏజీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.