Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 166 పాయింట్ల లాభంతో 57,795 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 17,034 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 పైసలు పుంజుకొని 82.54 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, సన్ఫార్మా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.