Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- అంబర్ పేట
పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్తున్న ఏడేళ్ల బాలుడు పై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన అంబర్ పేట డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ లో చోటుచేసుకుంది. ప్రేమనగర్ కు చెందిన మణికంఠ కుమారుడు సాయి సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో స్థానిక కిరాణా షాప్ లో పాల ప్యాకెట్ కొనడానికి వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వీధి కుక్కలు బాలుడు పై దాడి చేసి కలిచాయి. ఈ ఘటనలు తీవ్రంగా గాయపడిన బాలుడికి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. గత కొంతకాలంగా బస్తీలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించలేదని స్థానికులు వాపోయారు.