Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఢిల్లీ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు బడ్జెట్ను ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం ఆపేసిందని కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. అనంతరం ఎంహెచ్ఏ సోమవారం స్పందిస్తూ, ప్రతిపాదిత బడ్జెట్పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కొన్ని పరిపాలనపరమైన అంశాలను లేవనెత్తారని తెలిపింది. దేశ రాజధాని నగరం ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాలను లేవనెత్తారని తెలిపింది.
ఈ అంశాలను పరిష్కరించి బడ్జెట్ను తిరిగి పంపించాలని మార్చి 17న రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొంది. కేజ్రీవాల్ మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలపకుండా నిలిపివేయవద్దని కోరారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఓ రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలపకపోవడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నరన్నారు.