Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆశా వర్కర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పరిధిలో 323, మేడ్చల్లో 974, రంగారెడ్డి పరిధిలో 243 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆశా వర్కర్లను జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నారు.