Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నిర్మాణ పనులు ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఆవిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈలోగా అన్ని పనులనూ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.