Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కదిరి
టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఉగాది సందర్భంగా మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఈ మూడు రోజులు పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడీసీ మండలం వనుకువారిపల్లి విడిది కేంద్రంలోనే లోకేశ్ బస చేస్తారు. పండుగ కూడా విడిది కేంద్రంలోనే జరుపుకుంటారు. తిరిగి ఈనెల 25న గొనుకువారిపల్లి నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక రోజు, నందమూరి తారకరత్న మృతితో రెండు రోజులు వరుసగా మూడు రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. తారకరత్న అంత్యక్రియల్లో లోకేశ్ పాల్గొని.. శ్రీకాళహస్తి నుంచి పాదయాత్రను కొనసాగించారు. ఇటీవల ఎన్నికల నిబంధనలను గౌరవిస్తూ ఈనెల 12, 13 తేదీల్లో తాత్కాలికంగా యువగళం పాదయాత్రకు విరామిచ్చారు.