Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉక్రెయిన్
క్రిమియాపై ఉక్రెయిన్ దళాలు దాడి చేసి రష్యాకు చెందిన అత్యాధునిక కల్బిర్ క్రూజ్ క్షిపణులను ధ్వంసం చేశాయి. ఈ క్షిపణులను జాన్కోయ్ అనే నగరం నుంచి రైలులో రవాణా చేస్తుండగా దాడి చేసినట్లు ఆ దేశ రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని నేరుగా వెల్లడించకపోయినా.. క్రిమియాను నిస్సైనిక ప్రాంతంగా మార్చి ఆ తర్వాత ఆక్రమణదారులను తరిమేయడం కొనసాగుతోందని పేర్కొన్నారు. మరోవైపు క్రిమియాపై దాడిని అక్కడ రష్యా నాయకుడు సెర్గీ అస్కినోవ్ కూడా క్రిమియా ద్వీపకల్పంపై దాడి జరిగనట్లు ధ్రువీకరించారు. ఈ దాడిలో ఓ వ్యక్తి గాయపడగా.. రెండు భవనాలు ధ్వంసమయ్యాయని అస్కినోవ్ పేర్కొన్నారు. క్రిమియా ద్వీపకల్పంలో భారీ పేలుడు జరిగిన వీడియో ఒకటి ఆంగ్ల మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. రైల్వే స్టేషన్పై ఆ క్షిపణి దాడి జరిగిందని స్థానికులు వెల్లడిస్తున్నారు. క్రిమియాలో కీలకమైన ఎయిర్ ఫీల్డ్ల్లో జాన్కోయ్, గార్వెడెస్కోయ్లు కీలకమైనవి. వీటిల్లో జాన్కోయ్ కీలక రైల్వే కేంద్రం కూడా. దక్షిణ ఉక్రెయిన్ నుంచి ఇక్కడికి కీలకమైన యుద్ధ సామగ్రి సరఫరా అవుతుంది. దీంతోపాటు నల్లసముద్రంలో కీలకమైన నౌకాదళ స్థావరం క్రిమియాలోని సెవస్తోపోల్లో ఉంది. తాజాగా ఉక్రెయిన్ దాడిలో ధ్వంసమైన క్షిపణులు సెవస్తోపోల్లోని రష్యా నౌకదళాలకు అందాల్సి ఉంది.