Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి భువనగిరి : జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 16 వరకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనాలపై పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో సమ్మేళనాలపై రోడ్మ్యాప్ రూపొందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏ రోజు ఏ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలో రోడ్మ్యాప్ రూపొందించినట్లు తెలిపారు. 10 గ్రామాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 27న భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్లో జరిగే కార్యక్రమంతో ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభమవుతాయని, ఈ సమావేశానికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో 28 నుంచి సమ్మేళనాలు మొదలవుతాయన్నారు. భువనగిరి నియోజకవర్గంలో మొత్తం 15, ఆలేరు నియోజకవర్గంలో 17 సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.