Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కూతురి ప్రేమ వివాహం కారణంగా మానసిక వ్యధకు గురైన తల్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కూకట్పల్లి జయానగర్కాలనీలోని మైత్రేయి నిలయంలో ప్రైవేటు ఉద్యోగి గోనుగుంట శ్రీనివాసరావు, నిర్మల(45) కుటుంబం ఉంటోంది. వీరికి కుమారుడు సాయితేజ, కుమార్తె ఉన్నారు. కుమార్తె తన సహ విద్యార్థిని ప్రేమించింది. ఈ నెల 17న ఇంట్లోంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది. అప్పటి నుంచి తల్లి మదనపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మంగళవారం ఉదయం బెడ్రూంలోకి వెళ్లి తలుపేసుకుని, ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుమారుడు మరో తాళంచెవితో తలుపులు తెరిచి చూడగా చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని కన్పించింది.