Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) షెడ్యూల్ను విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 27న ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 17న రాత్రి 7గంటల వరకు కొనసాగుతుందని పేర్కొంది.
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ప్రాథమిక /వెయిటింగ్ తొలి జాబితాను ఏప్రిల్ 20న విడుదల చేసి ఏప్రిల్ 21 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. పూర్తి వివరాలను https://kvsangathan.nic.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.