Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. వరుసగా రెండోరోజూ మార్కెట్లు లాభాలను నిలబెట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య ట్రేడింగ్ను సానుకూలంగా ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. అయితే, ఈరోజు రాత్రి వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక ప్రకటన చేయనుంది.
ఉదయం సెన్సెక్స్ 58,074.68 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,418.78- 58,063.50 మధ్య కదలాడింది. చివరకు 139.91 పాయింట్ల లాభంతో 58,214.59 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,177.45 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,207.25- 17,107.85 మధ్య ట్రేడైంది. చివరకు 44.40 పాయింట్లు లాభపడి 17,151.90 దగ్గర ముగిసింది.