Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: హయత్నగర్ మునుగానూర్ ద్వారక నగర్లోని మేజిస్ట్రేట్ ఇంటి వద్ద తీన్మార్ మల్లన్న.. మరికొందరిని పోలీసులు హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి మల్లన్నకు 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో మల్లన్నతో పాటు మరో నలుగురిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
తీన్మార్ మల్లన్నపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని.. ఈ ప్రభుత్వం ప్రజా గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని మల్లన్న భార్య మమత విమర్శించారు. ఈ రోజు ఉదయం నుంచి పోలీసులు మల్లన్నను పలు పోలీస్ స్టేషన్లకు తరలించారని.. ఇక్కడా మల్లన్నను పోలీసులు కలవ నియ్యలేదని, అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న రిమాండ్పై గురువారం ఎల్బీనగర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని మమత తెలిపారు. క్యూ ఆఫీస్పై దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు.