Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కంఠేశ్వర్
శ్రీ శోభ కృత్ నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీశ్రీశ్రీ నవదుర్గ దేవి మాత ఆలయంలో టీఎన్జీవోస్ పక్షాన ప్రత్యేక పూజలు, ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం వేలేటి పశుపతి శర్మచే ఏర్పాటుచేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు ఉగాది పచ్చడిని స్వీకరించి ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్, టిఎన్జీవో జిల్లా కార్యదర్శి అమృత్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉద్యోగులు తదితరులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.