Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ కేసులో సిట్ దర్యాప్తులో టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న వాళ్లందరినీ ప్రశ్నిస్తోంది సిట్. తాజాగా టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న 42 మంది ఉద్యోగులకూ సిట్ నోటీసులు జారీ చేసింది. వీళ్లలో పేపర్ లీక్స్ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్లతో సంబంధాలు ఉన్న వాళ్లే ఉన్నట్లు సమాచారం. దీంతో వాళ్లను ప్రశ్నించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే కాన్ఫిడెన్షియల్ రూం అధికారిణి శంకర్ లక్ష్మిని రెండుసార్లు పిలిపించుకుని ప్రశ్నించింది సిట్. ఈమె సిస్టమ్ నుంచే పేపర్లు లీక్ అయ్యాయనే అనుమానాలు ఉన్నాయి. తాజాగా నోటీసులు ఇచ్చినవాళ్లలో టీఎస్పీఎస్సీలో టెక్నికల్ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
నేడు సిట్ దర్యాప్తు ఐదవ రోజు ముగిసింది. మొత్తం తొమ్మిది మంది నిందితులను ఏడు గంటలపాటు విచారణ చేపట్టింది సిట్. ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్లలోని ప్రశ్న పత్రాలు లీక్ కావడంపై నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించారు. అదే సమయంలో పలు అంశాలపై టెక్నికల్ ఆధారాలు సేకరించించింది సైబర్ క్రైమ్ టెక్నికల్ టీం. రేణుక, నిలేష్, గోపాల్ల నడుమ రూ. 14 లక్షల నగదు ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు గుర్తించింది.