Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచివున్నారు.. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పట్టనుంది. బుధవారం శ్రీవారిని 53,146 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 18,655 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.