Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ, వైసీపీ నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో అభ్యర్థి విజయానికి అవసరమైన 22 మంది ఎమ్మెల్యేలను ఒక బృందంగా ఏర్పాటు చేసిన అధికార వైసీపీ.. వారితో ఓట్లు వేయిస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల తరువాత ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రులు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు 35 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేసినట్లు సమాచారం.