Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఈ సీజన్ ఐపీఎల్ ఈనెల 31 నుంచి మే 28 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఫ్రాంచైజీలు తమ తుది జట్లను, ఇంపాక్ట్ ప్లేయర్ వివరాలను టాస్ వేసిన తర్వాత కూడా ప్రకటించే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. దీంతో టాస్ గెలుపోటములను బట్టి అత్యుత్తమ జట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా టాస్కు ముందే ఇరుజట్ల కెప్టెన్లు తమ తుది జట్టు జాబితాను వెల్లడించాలన్న నిబంధన ఉంది. దానానా బ్రెక్ చేస్తూ కొత్త నిబంధనను తీసుకురావడం విశేషం.