Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎర్రగంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. గురువారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఎర్రగంగిరెడ్డికి నోటీసులు ఇస్తూ తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని 2019 మార్చి 28న సిట్ అధికారులు అరెస్టు చేశారు. 90 రోజుల్లో సిట్ ఛార్జిషీట్ వేయకపోవడంతో గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే 2021 అక్టోబరులో ఎర్రగంగిరెడ్డిపై సీబీఐ ఛార్జ్షీట్ వేసింది. గంగిరెడ్డిపై బెయిల్ రద్దు చేయాలంటూ గతంలో ఏపీ హైకోర్టును సీబీఐ కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు సూచనలతో తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం ఎర్రగంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది.