Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: ఐపీఎల్ కెప్టెన్లు ఇక టాస్ పడ్డాక తుది జట్లను ప్రకటించవచ్చు. ఈ మేరకు నిబంధనల్లో బీసీసీఐ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం కెప్టెన్లు టాస్కు ముందే తుది జట్టు వివరాలను ప్రకటించాలి. ‘‘రెండు జట్ల కెప్టెన్లు.. 11 మందితో కూడి తుది జట్టు, అయిదుగురు సబ్స్టిట్యూట్ల వివరాలను టాస్ తర్వాత లిఖిత పూర్వకంగా ఐపీఎల్ మ్యాచ్ రిఫరీకి అందించవచ్చు. ముందు తుది జట్టును వెల్లడించినా.. మ్యాచ్ ఆరంభానికి ముందు ప్రత్యర్థి కెప్టెన్ అనుమతి లేకుండా మార్పులు చేసుకోవచ్చు’’ అని బీసీసీఐ తెలిపింది. నిబంధనల మార్పుతో టాస్ ఆధారంగా తుది జట్టును ఎంచుకోవడానికి అవకాశం లభించింది.