Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. గురజాల దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు బాలినేని వెంకటరెడ్డి (52) గుండెపోటుతో మృతి చెందారు. బాలినేని వెంకటరెడ్డి మృతి పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటుతో వెంకటరెడ్డి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వైసీపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంకటరెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాలలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజుకు పెరుగుతూ ఉండడం తీవ్ర కలకలం రేపుతుంది.