Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే కవితను ఈడీ మూడు సార్లు విచారించింది. ఇంకోవైపు మహిళను విచారించే విధానంపై ఈడీకి తగిన మార్గదర్శకాలను ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈ నెల 24న విచారిస్తామని ఇంతకు ముందు చీఫ్ జస్టిస్ ధర్మాసనం తెలిపింది. అయితే, విచారణ తేదీని 27కి మార్చింది. ఈ నెల 27న జస్టిస్ అజయ్ రస్తోగి, బేలా త్రివేదీల ధర్మాసనం పిటిషన్ ను విచారించనుంది. మరోవైపు ఈడీ విచారణకు కవిత హాజరైన ప్రతిసారీ ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కవిత పిటిషన్ ను 27న విచారస్తామని సుప్రీంకోర్టు చెప్పడంతో... ఈలోగా ఆమెను ఈడీ మరోసారి విచారణకు పిలవొచ్చనే చర్చ ప్రారంభమయింది. ఈసారి విచారణకు వస్తే ఆమెను కచ్చితంగా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.