Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమల: ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల వసంతోత్సవ సేవా టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 27వ తేదీ విడుదల చేయనుంది. ఏటా చైత్రశుద్ధి పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలను ఆలయం వెనుకభాగంలో ఉన్న వసంతమండపంలో నిర్వహించడం ఆనవాయితీ. రోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఎప్పటిలానే భక్తులను ఈ సేవకు అనుమతించేలా టీటీడీ మూడురోజులకు సంబంధించిన టికెట్ల కోటాను Tirupatibalaji.AP.GovV.in వెబ్సైట్లో 27వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ నెల ఉచిత టోకెన్ల కోటాను టీటీడీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. మరోవైపు జూన్ నెలకు సంబంధించిన ఆర్జితసేవా టికెట్ల లక్కీడిప్ రిజిస్ర్టేషన్లు కూడా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 11 గంటలకు వరకు చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది.