Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో గత కొన్ని రోజులుగా వాతావరణం మారిపోయింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తూ వాతావరణాన్ని చల్లబరిచాయి. ద్రోణి ప్రభావం కొనసాగుతుండడమే ఇందుకు కారణం. తాజాగా, వాతావరణశాఖ మరోమారు హెచ్చరికలు చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడే వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నిన్న ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని పంటలు దెబ్బలు తిన్నాయి.