Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి : హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం వద్ద బస్సును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. క్యాబిన్లోనే డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్లను సుమారు రెండు గంటల పాటు శ్రమించి పోలీసులు స్థానికుల సహాయంతో బయటికి తీశారు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో క్లీనర్ మృతి చెందాడు. డ్రైవర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.