Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమైన కాపేపటికే అమ్మకాల సెగతో నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో 57,770 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 17,021 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.28 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, ఐటీసీ, మారుతీ, ఎల్అండ్టీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టైటన్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.