Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ సర్కార్ (67) శుక్రవారం ఉదయం (మార్చి 24) తుది శ్వాస విడిచారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రదీప్.. ఈరోజు తెల్లవారుజామున హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన బంధువు నటి నీతు చంద్ర శ్రీవాత్సవ వెల్లడించారు. దీంతో ప్రదీప్ హెలికాప్టర్ ఈలా, పరిణీత, మార్గానీ వంటి చిత్రాలు తీసి మంచి గుర్తింపు పొందారు. ఈయన సినిమాల్లోకి రాకముందు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. కమర్షియల్ యాడ్స్ ను డైరెక్ట్ చేశారు. ప్రదీప్ మృతిపై ప్రముఖులు సంతాపం తెలిపారు.