Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాజకీయ కుట్రలో భాగంగా సీబీఐ, ఈడీ వంటి సంస్థలను మోడీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న విపక్షాలు తాజాగా ఈ విషయంపై మూకుమ్మడిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల వివక్షపూరిత వినియోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీలు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం..ఏప్రిల్ 5న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలు.. కేవలం బీజేపీ ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఈ పిటిషన్లో విపక్షాలు ఆరోపించాయి. ఒకవేళ సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరితే.. ఆ తర్వాత వారిపై ఉన్న కేసులు ముగిసిపోతున్నాయని దుయ్యబట్టాయి. '95శాతం కేసులు ప్రతిపక్షాలపైనే. అరెస్టుకు ముందు, తర్వాత దర్యాప్తు సంస్థలు పాటిస్తున్న మార్గదర్శకాలు ఏమిటీ?' అని విపక్ష పార్టీలు ఈ పిటిషన్లో కోరాయి.