Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఛత్తీస్గఢ్
శుక్రవారంఛత్తీస్గ ఢ్లోని అంబికాపూర్ లో 4.1 తీవ్రతతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. సూరజ్పూర్లోని భట్గావ్ ప్రాంతంలో భూమికి 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటుగా శుక్రవారం మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో భూకంపం సంభవించింది. గ్వాలియర్కు ఆగ్నేయంగా 28 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం ఉదయం 10:31 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ రెండు భూకంపాలు తక్కువ తీవ్రతవే కావడంతో భూ ప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదు.