Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షల హాల్టిక్కెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షల హాల్టిక్కెట్లను ఎస్ఎస్సీ బోర్డు తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థుల కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎస్ఎస్సీ వెబ్సైట్లో విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. రెగ్యులర్, ప్రయివేటు, ఓఎస్ఎస్సీ, వొకేషనల్ విద్యార్థులు తమ హాల్ టికెట్లను పొందొచ్చు.