Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో నేడు ప్రభుత్వం రెండు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది బోయ/వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. మరోవైపు, క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయిన దళితులను ఎస్సీలుగా పరిగణించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ మరో తీర్మానం చేసింది ఏపీ అసెంబ్లీ. ఈ తీర్మానాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున సభలో ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులను కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ. ఈ క్రమంలో ఈ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని ప్రకటించారు సీఎం.
ఈ తరుణంలో అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం, దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం చేశాం. అసెంబ్లీలో ఆమోదించిన ఆ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నాం అని వెల్లడించారు. పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని, రాయలసీమ జిల్లాల్లో ఆ కులాలు ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్ తెలుసుకుంది. ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో, ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తీర్మానం చేశామన్నారు.