Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న కారణంతో నలుగురు ఎమ్మెల్యేలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలకు దిగింది. ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సస్పెండ్ చేసినట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు వైయస్ఆర్సీపీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అయితే పార్టీ అధ్యక్షుడితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.