Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రంగారెడ్డి
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటర్ విద్యార్థిని శాంతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో అఘాయిత్యానికి పాల్పడడం తీవ్ర విషాదం కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.