Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
దిల్లీ: పరువునష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీ.. పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన ఆయన.. ‘భారత్ గళాన్ని వినిపించేందుకే తాను పోరాటం చేస్తున్నానని.. ఈ క్రమంలో ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమే’ అని ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఆయనపై అనర్హత వేటు విధిస్తున్నట్లు లోక్సభ సెక్రటేరియట్ శుక్రవారం ప్రకటించింది. తీర్పు వెలువడిన మార్చి 23 నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. అంతకుముందు, అనర్హత వేటుకు సంబంధించి ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ పార్లమెంట్కు హాజరయ్యారు. తొలుత పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి హాజరైన ఆయన.. ఆ తర్వాత లోక్సభ ప్రారంభం కాగానే అందులో పాల్గొన్నారు.