Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జైసల్మేర్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్లోని పోఖరన్ శ్రేణుల వద్ద ఆర్మీ యూనిట్ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా మిస్సైల్ మిస్ ఫైర్ అయింది. పోఖ్రాన్ లో క్షిపణి విమానంలో పేలిన ఘటనతో శిథిలాలు పక్కనే ఉన్న పొలాల్లో పడినట్లు భారత ఆర్మీ అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని ఆర్మీ తెలిపింది. ఫోఖ్రాన్ లో ఆర్మీ మిస్సైల్ మిస్ ఫైర్ ఘటనపై ఆర్మీ విచారణకు ఆదేశించింది. ‘‘ఆర్మీ మిస్సైల్ మిస్ ఫైర్ ఘటనలో సిబ్బందికి, ఆస్తికి ఎటువంటి నష్టం జరగలేదు. ఈ సమస్యపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.