Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గత మంగళవారం బండి సంజయ్కి సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా దూరంగా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా తాను ఢిల్లీలో ఉన్నానని, సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున హాజరుకాలేనంటూ సిట్కు బండి సంజయ్ లేఖ రాశారు. ఈ తరుణంలో తాజాగా మరోసారి సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. దీనిలో ఆదివారం తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. పేపర్ లీక్ కుంభకోణంలో చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని, ఆధారాలను సమర్పించాలని అధికారులు నోటీసుల్లో తెలిపారు.