Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూయార్క్
సిలికాన్ వ్యాలీ దిగ్గజం, ప్రముఖ దాత గోర్డన్ మూర్ (94) కన్నుమూశారు. 1950 దశకంలో ఆయన సెమీకండక్టర్ల వ్యాపారం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన ఇంటెల్ కార్పొరేషన్ సంస్థను స్థాపించారు. ప్రతి ఏడాది కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్స్ రెట్టింపు అవుతుందని ఆయన అంచనా వేశారు. కంప్యూటర్ ప్రాసెసర్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. పీసీ రెవల్యూషన్లో ఆయన పాత్ర ప్రత్యేకమైంది. మెమోరీ చిప్స్ తయారీలోనూ మూర్ తనదైన ముద్ర వేశారు.