Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్బీ నగర్ చౌరస్తాకు నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇవాళ ప్రారంభించుకున్న ఫ్లై ఓవర్కు మాల్ మైసమ్మ అని నామకరణం చేస్తున్నట్లు తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఈ తరుణంలో ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎస్ఆర్డీపీ కింద ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మొత్తం 12 పనులను రూ. 650 కోట్లతో చేపట్టామని కేటీఆర్ తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ 9వ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఇంకా మూడు ప్రాజెక్టులు మిగిలి ఉన్నాయి. బైరామల్గూడలో సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్, రెండు లూప్లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు.